ఆంధ్రదేశంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు...
పెదవేగి క్షేత్రం-(Pedavegi Buddhist sites)
ఈ కాలంలో ప్రఖ్యాతిలోకి వచ్చిన బౌద్ధ క్షేత్రం పెదవేగి. అది ఇక్ష్వాకుల పతనం తర్వాత శాలకాయనులు కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతానికి పాలకులయ్యారు. వారి రాజధాని "వేంగి". వారి రాజధాని పేరుతోనే వారి రాజ్యానికి వేంగి రాజ్యం అని పేరువచ్చింది.
అప్పటినుండి ఆంధ్రదేశ చరిత్రలో వేంగి పట్టణానికి ప్రాచుర్యం వచ్చింది. కనుక బౌద్దులు వేంగిలో తమ కార్యకలాపాలను పెంచి ఉంటారు. అంతకుముందే ఎహువుల శాంతిమూలుని కాలంలోనే అక్కడ విమారం ఉంది.
శాలంకాయన కాలంలో అది బాగ అభివృద్ధి చెందింది. రెండవ నందివర్మ దానిని పోషించాడు. దిగ్నాగుడు వేంగి విహారంలో నివసించాడని హ్యుయాన్ సాంగ్ రాశాడు. కనుక వేంగి విహారం చతురస్రపు వేదికపై నిర్మించబడింది. ఈ విహారంలో ఒక ప్రత్యేకత ఉంది. స్థూప ప్రాకార మూలలో దీర్ఘచతురస్రాలకారపు మందిరం ఉంది. మరొక విశేషమేమంటే స్థూప సముదాయానికి ప్రవేశ ద్వారం ఉంది. దాని ముఖభాగం గాంధార స్థూప ముఖంలాగా ఉంది. ఇవన్నీ ఇటుకల నిర్మాణాలు.
![]() |
ఆంధ్రదేశంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు |
ఏ దోఆబ్ ప్రాంతాన్ని వేంగి(Vengi) అని కూడా పిలుస్తారు
వెంగి ( ఆధునిక కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ) అని పిలువబడే కృష్ణా మరియు గోదావరి నదిలోని దోబ్ ప్రాంతంలో తీవ్రంగా పోటీపడిన సారవంతమైన నదీ లోయలపై 11వ శతాబ్దంలో పశ్చిమ దక్కన్ రాజ్యానికి మరియు తమిళ దేశానికి మధ్య తీవ్రమైన పోటీ తెరపైకి వచ్చింది.
వేంగి(Vengi) ప్రస్తుత పేరు
"వేంగి(Vengi) లేదా వెంగినాడు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్" , భారతదేశంలోని గోదావరి మరియు కృష్ణా నది డెల్టాలలో విస్తరించి ఉన్న ఒక చారిత్రాత్మక ప్రాంతం. "ఏలూరు సమీపంలోని పెదవేగిలో ఉంది"-Located at Pedavegi near Eluru.
విజయవాడ గుహలు-(Vijayawada Caves)
బెజవాడలోని ఇంద్రకీలాద్రికి దిగువలో "కనక దుర్గమ్మ గుడికి వెళ్లే మార్గంలో ఉన్నది" మూడు చిన్న శిథిల గుహలున్నవి. వానికి కొంచెం పైన అక్కన, మాదన్న గుహలున్న వి. దిగువలో ఉన్న గుహలు జైన గుహలు. అచట అయ్యణ మహాదేవి నేడం బసది నిర్మించింది. ఈ మధ్య అచట క్రీ. శ. 2వ శతాబ్ద నాటి శాసనం ఒకటి కనుగొనబడింది. అవి జైన గుహలు.
![]() |
ఆంధ్రదేశంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు |
బెజవాడ ద్వారపాలుడు:(vijayawada guhalu)
వేంగి చాళుక్యులు 7వ శతాబ్దంలో తమ పాలనను ప్రారంభించినప్పటికీ 7వ శతాబ్దానికి చెందిన వారి దేవాలయాలు లభించలేదు. కాని వారు దేవాలయాలను నిర్మించారు. విజయవాడలో 7వ శతాబ్దంలో వారు నిర్మించిన దేవాలయ శిథిలాలు లభ్యమయ్యాయి. ఆ శిథిలాలలో లభించిన ద్వారపాలుని విగ్రహాలు "మద్రాసు మ్యూజియంలో" భద్రపరిచారు. అందులో ఒక ద్వారపాలుని విగ్రహంపై దానిని చెక్కించిన శిల్పిపేరు గుండయ అని ఉంది. మనకు లభ్యమైన వేంగి శిల్పకళకు చెందిన మొట్టమొదటి శిల్పాలు ఇవే. వీటిలో మొదటి విగ్రహం త్రిభంగస్థితిలో నిలబడి ఉంది.
పెద్ద శరీరంతో కుడికాలి మీద బరువు మోపి నిలబడి ఉన్నాడు. ఎడమ కాలు ముందుకు వంచి కుడి కాలు పైకి పెట్టి ఉంది. కింది ఎదమ చేయి పక్కన ఉన్న ఒక కొయ్యపై ఆనించి ఉంది. ఎడమ చేయి విరిగిపోయింది. కింది కుడి చేయి విస్మయ హస్తంలో ఉంది. పై కుడిచేయి విరిగిపోయింది. మెడలో రెండు నక్లెస్లు ఉన్నాయి. ఉదర బంధం వజ్రాలతో పొదిగి ఉంది. కటిబంధం యజ్ఞోపవీతం కూడా ఉంది. చేతులకు కేయూర కంకణాలు, తాటంక చక్రం ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన విశేషం కటివస్త్రం పెద్ద మడతతో ఉండి మధ్యలో ముడి వేయబడి ఉంది. ముడివేయగా మిగిలిన వస్త్రం మధ్యలో కిందికి వేలాడుతుంది. తల వెంట్రుకలు మడిచి నెత్తిపైన గట్టిగా ముడి వేయబడి ఉన్నాయి. గుండ్రని ముఖం, లావు ముక్కు బాగా వంగిన కనుబొమ్మలు, వెడల్పుగా ముడుచుకున్న పెదాలు, పెద్ద గెడ్డం కలిగి ఉన్నాడు. ఆంధ్రదేశంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు.
రెండవ ప్రతిమ కూడా అలాగే ఉంది. శరీరం ఎడమకు వంగి తల కుడి వైపునకు చూస్తుంది. యజ్ఞోపవీతం ఉన్నాయి. (ఈ విగ్రహాలను కొందరు బాదామి గుహలలోని శిల్పాలతో పోల్చారు). ఈ శిల్పాలు చెక్కిన శిల్ప గుండయ కుబ్జ విష్ణువర్ధనుని ఆస్థాన శిల్పి అని శివ రామమూర్తి అనే పండితుడు భావించారు. ఈ విజయవాడ శిల్పాలు వేంగి చాళుక్యులకు ముందు అంటే విష్ణుకుండినులు చివరిదశలో అంటే క్రీ. శ. 6వ శతాబ్దపు శిల్పకళా లక్షణాలై ఉండవచ్చునని బాదామి శిల్ప లక్షణాలు కాదని అవి స్థానిక శైలి అని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.
FAQ :
- వేంగి ప్రస్తుత పేరు ఏమిటి?
- బౌద్ధ ఆరామాలు అంటే ఏమిటి?
ఆధ్యాత్మిక , ప్రశాంతంగా బుద్ధుని నీడలో ధ్యానం చేసుకోవాలనుకునే వారికి బౌద్ధ ఆరామాలు మంచి ప్రదేశాలుగా నిలుస్తాయి. "భారతదేశం అనేక పురాతన బౌద్ధ ఆరామాలు, బుద్ధుని దేవాలయాలకు నిలయంగా ఉంది". ఇవి బౌద్ధమతంలోని గొప్ప చరిత్ర, సంస్కృతికి సంగ్రహావలోకనం అందిస్తాయి.
- బౌద్ధ మతం దేశాలు ఎన్ని?
"కంబోడియా(Cambodia),మయన్మార్(Myanmar), భూటాన్(Bhutan) మరియు శ్రీలంక(Sri Lanka)" అనే నాలుగు దేశాలలో బౌద్ధమతం అధికారిక మతం. థాయిలాండ్(Thailand) మరియు లావోస్(Laos) అనే రెండు దేశాలలో కూడా ఈ మతానికి ప్రత్యేక హోదా ఉంది. 'భూటాన్, మయన్మార్, కంబోడియా, శ్రీలంక, థాయిలాండ్, మంగోలియా మరియు లావోస్లలో బౌద్ధమతం మెజారిటీ మతం'.
- బుద్ధుడు ఎక్కడ జన్మించాడు నేపాల్ లేదా భారతదేశం?
'మౌర్య చక్రవర్తి అశోకుడు' నిర్మించిన స్తంభంపై ఉన్న క్రీ.పూ. 249లో శాసనం ద్వారా, బుద్ధుడు 623 BCలో దక్షిణ నేపాల్లోని(Nepal) టెరాయ్ మైదానంలో ఉన్న లుంబినీ అనే పవిత్ర ప్రాంతంలో జన్మించాడు.
- బుద్ధుని నిజమైన కథ ఏమిటి?
శాక్య వంశానికి చెందిన రాజ తల్లిదండ్రులకు ఇప్పుడు నేపాల్లో(Nepal) ఉన్న లుంబినీలో జన్మించాడు, అయితే అతను సంచారం చేసే సన్యాసిగా జీవించడానికి తన ఇంటి జీవితాన్ని త్యజించాడు . ధ్యానం, దౌర్భాగ్యం, సన్యాసం యొక్క జీవితాన్ని గడిపిన తరువాత, ఇప్పుడు 'భారతదేశంలోని' బోధ్ గయలో మోక్షాన్ని పొందాడు.
- బుద్ధుడు పెళ్లి చేసుకున్నాడా?
"బుద్ధుడికి పెళ్లి కాలేదు".
Post a Comment